మహిమాన్విత నగరం మక్కా పురం

Originally posted 2016-12-25 11:59:07.

అది ఎంతో శుభప్రదమయినది సృష్టి మొత్తంలో కేవలం కాబా గృహ చుట్టు ప్రదక్షిణ చేయడం మాత్రమే సమ్మతించ బడింది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”ఆ తర్వాత వారు (దేవుని) ఆ ప్రాచీన గృహా నికి ప్రదక్షిణ చేయాలి”.

అది ఎంతో శుభప్రదమయినది సృష్టి మొత్తంలో కేవలం కాబా గృహ చుట్టు ప్రదక్షిణ చేయడం మాత్రమే సమ్మతించ బడింది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”ఆ తర్వాత వారు (దేవుని) ఆ ప్రాచీన గృహా నికి ప్రదక్షిణ చేయాలి”.

”నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన గృహం బక్కా (మక్కా) లో ఉన్నదే. అది ఎంతో శుభప్రదమైనది. సమస్తలోక వాసులకు మార్గదర్శకం కూడాను. అందులో స్పష్టమైన సూచనలున్నాయి. అందులో ప్రవేశించినవాడు రక్షణ పొందుతాడు. మరియు అక్కడికి వెళ్ళే స్థోమత గలవారికి, ఆ గృహ యాత్ర-హజ్జ్‌ చేయటాన్ని అల్లాహ్‌ విధి గా చేశాడు”. (ఆలి ఇమ్రాన్: 96<97)
 ఈ వచనాలలో కాబా గృహ ఔన్నత్యాన్ని, ప్రాస్తశ్యాన్ని పేర్కోనడం జరిగింది. కాబా గృహానికి సంబంధించిన అయిదు విశిష్ఠతలి వివరించబడ్డాయి.
1) మొదటి దైవ గృహం
పూర్తి భూమండలంపై మొదటి దైవ గృహ గౌరవం కాబాకే దక్కింది. యూదులు భావించి నట్లు ‘బైతుల్‌ మఖ్దిస్‌’ అన్నిటికన్నా మొదటి ఆరాధనాకేంద్రం కానేకాదు. ఈ విషయమై దైవ ప్రవక్త మహమ్మద్‌ (స) వారిని ప్రశ్నించి నప్పుడు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు:
  ”భూమండలం మీద మొట్టమొదట నిర్మించ బడిన దైవ గృహమేది? అని అడగ్గా – ‘కాబా’ అన్నారు. ఆ తర్వాత ఏ గృహం అని ప్రశ్నించ గా – ‘మస్జిదె అఖ్సా’ అన్నారు. ఈ రెంటికి మధ్య ఎంత కాలం తేడా ఉందని అడగ్గా – ’40 సంవత్సరాలు” అని ప్రవక్త (స) బదులి చ్చారు. (బుఖారీ, ముస్లిం)
 కొందరు ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం -ఈ గృహాన్ని తొలుత దైవ దూతలు నిర్మి చారు. తర్వాత ఆది మానవుడైన ప్రవక్త ఆదం (అ) ఈ గృహం మీద డోము కట్టిం చారు. ఆనక అది నూహ్‌ (అ) గారి కాలంలో వచ్చిన జలప్రళయంలో నేలమట్టం అవగా, తర్వాత దైవ దూత జిబ్రయీల్‌ (అ) సూచనల మేరకు ప్రవక్త ఇబాహీమ్‌ (అ) అవే పునాదు లపై ఈ గృహాన్ని పునర్నిర్మించారు అన్నది. ఏదిఏమైనా ప్రవక్త  ఇబ్రాహీమ్‌ (అ)గారి నిర్మాణం తర్వాత  నుండి మొదలు నేటి వరకు ఆ గృహం  ప్రజల్ని ఆకట్టుకుంటూనే ఉంది. నాటి నుండి మొదలు ప్రపంచ ప్రజలు ఆ గృహాన్ని ఉద్దే శ్యించి హజ్జ్‌ ఉమ్రాలు చేస్తూనే ఉన్నారు.
2) అది ఎంతో శుభప్రదమయినది సృష్టి మొత్తంలో కేవలం కాబా గృహ చుట్టు ప్రదక్షిణ చేయడం మాత్రమే సమ్మతించ బడింది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”ఆ తర్వాత వారు (దేవుని) ఆ ప్రాచీన గృహా నికి ప్రదక్షిణ చేయాలి”. (అల్‌హజ్జ్‌ 29)
  ఈ ఆయతులో ప్రాచీన గృహం అంటే పవిత్ర కాబా గృహమే. కాబా ప్రపంచంలోని ముస్లింలందరి కోసం నమాజు చేసే దిశగా, ప్రదక్షిణ చేెసే స్థలంగా ప్రసిద్ధి. ప్రదక్షిణ కేవ    లం కాబాకు మాత్రమే ప్రత్యేకం. ఇతర ప్రార్థ నాలయాల వద్ధ ప్రదక్షిణ చేయడానికి వీల్లేదు. దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”భూ మండలంలో కాబా ఎక్కడుందో దానికి నేరుగా ఏడు ఆకాశాలపైన బైతుల్‌ మామూర్‌ ఉంది. దానిపైన స్వర్గం ఉంది. స్వర్గ శిఖర భాగమైన ఫిర్‌దౌస్‌ పైన అల్లాహ్‌ా అర్ష్‌ ఉంది”.  (దారమీ)
 ప్రాంతం, ప్రదేశ పరంగా ఇటువంటి ప్రాస్త శ్యం మరే స్థలానికి లేదు. దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”తవాఫ్‌ చేస్తూ మనిషి వేసే ప్రతి అడుగుకి బదులు పది పుణ్యాలు లిఖించబడతాయి.  పది  పాపాలు  మన్నించ బడతాయి. స్వర్గపు పది అంతస్థులు పెంచబడ తాయి”. (అహ్మద్)
  మరో హదీసులో ఇలా ఉంది: ”మస్జిదె హరామ్‌లో ఒక నమాజు చేయడం అనేది ఇతర మస్జిద్‌లలో లక్ష నమాజులు చేసేంతటి పుణ్యానికి సమానం” అన్నారు ప్రవక్త (స).  (ఇబ్ను మాజా)
  ”మూడు మస్జిద్‌ల వైపు తప్ప మరే ఇతర చోటుకి పుణ్యఫలాపేక్షతో ప్రయాణం చేయ కూడదు. 1) మస్జిదె హరామ్‌ (కాబా). 2) మస్జిదె అఖ్సా 3) నా ఈ మస్జిద్‌ (మస్జదె నబవీ)”  అన్నారు ప్రవక్త (స).
3) అది సమస్తలోకవాసుల కోసం మార్గదర్శక కేంద్రం.
  ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”(జ్ఞాపకం చేసు కోండి) మేము ఈ గృహాన్ని (కాబాను) మాన వులందరి పుణ్యక్షేత్రంగానూ, శాంతి నిలయం గానూ చేశాము”. (అల్‌ బఖరా: 125)
  ఈ ఆయతులో ‘మసాబతల్లిన్నాస్‌’ అంటే పుణ్యక్షేత్రం మరియు మాటిమాటికీ మరలి రావలసిన స్థలం అన్న అర్థం కూడా వస్తుంది. ఈ గృహ విశిష్ఠత ఎట్టిదంటే, ఒకసారి ఈ కాబా గృహాన్ని సందర్శించుకున్నవారు   మరో సారి, ఇంకోసారి, మళ్ళింకోసారి కూడా అక్కడి కి రావాలని ఉవ్విళ్ళూరుతుంటారు. అలా ఎన్ని సార్లు సందర్శించుకున్న వారి దాహార్తి తీరదు. అదొక శాంతి నిలయం. అక్కడ శత్రు భయం కూడా ఉండదు.  అజ్ఞాన కాలంలో సయితం ప్రజలు ఆ పుణ్య క్షేత్రం పరిధిలో శత్రువును, స్వయాన తండ్రిని చంపిన హంతకుణ్ణి సయితం సంహరించే వారు కాదు.
  ఇక్కడ మనకు ప్రవక్త ఇబ్రాహీమ్‌ (అ) గారి దుఆ గురుకొస్తుంది. ఆయన దైవాన్ని ఇలా వేడుకున్నారు: ”నా ప్రభూ! ఈ నగరాన్ని శాంతిభద్రతలు గల నగరంగా చేయి. నన్నూ, నా సంతానాన్ని విగ్రహ పూజ నుంచి కాపాడు”. (ఇబ్రాహీమ్ సూరా)
పై ఆయతులో ‘ఈ నగరం’ అంటే మక్కా అని భావం. ఇతరత్రా విషయాలను అర్థించే ముందు ప్రవక్త ఇబ్రాహీమ్‌ (అ) మక్కా నగరాన్ని శాంతియుతంగా ఉంచమని అర్థించ టం విశేషం! ఎందుకంటే నగరంలో ప్రశాం త పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడే ప్రజలు దైవానుగ్రహాలలోని మాధుర్యాన్ని ఆస్వాదించ గలుగుతారు. శాంతి, సుస్థిరతలు కొరవడిన చోట మనిషికి ఎన్ని కానుకలు, లాభాలు, పురస్కారాలు ప్రాప్తించినా అవి రుచించవు. అశాంతి అలజడుల వాతావరణంలో మనిషి క్షణం క్షణం భయాందోళన చెందుతూ ఉం టాడు. నేడు ప్రపంచంలో వివిధ సమాజాల ను, వివిధ ప్రదేశాలను పరికిస్తే ఈ సంగతి అర్థమవుతుంది. అయితే మక్కాలోని పరిస్థితి దీనికి భిన్నంగా కనిపిస్తుంది. ఇది దేవుని అనుగ్రహం తర్వాత ప్రవక్తల పితామహుడు ఇబ్రాహీమ్‌( అ) చేసిన ప్రార్థనా ఫలితమే. నేటి దౌర్బాగ్య స్థితిలో సయితం సమస్త మానవాళికి శాంతి సందేశాన్ని అందజేస్తున్న ఏకైక కేంద్రం మక్కా. ఇటువంటి పవిత్ర ప్రదేశం, ప్రశాంత ప్రాంతం ప్రపంచమంత టిలో లేదంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు.
  తర్వాత ఇబ్రాహీమ్‌ (అ) చేసిన దుఆను గమనిస్తే-, ఆయన (అ) ఇలా ప్రార్థించారు: ”మా ప్రభూ! నా సంతానంలో కొందరిని ఎలాంటి పంటలు పండని కటిక లోయలో నీ పవిత్ర గృహం వద్ద వసింపజేశాను. మా ప్రభూ! వారు నమాజును నెలకోల్పేందుకు (ఇక్కడ వదలి పెట్టాను). కనుక ప్రజల్లోని కొందరి హృదయాలు వారి వైపు మొగ్గేలా చేయి. వారికి తినడానికి పండ్లు ఫలాలను ప్రసాదించు. వారు కృతజ్ఞులుగా మెలిగేందుకు”. (ఇబ్రాహీమ్‌)
 అది ప్రపంచ ప్రజలందరికీ మార్గదర్శక కేంద్రం ఎలా అయిందో మీరే చూడండి! ప్రపంచ నలు మూలల నుంచి ముస్లింలు ఎలా భక్తీప్రపత్తులతో మక్కా వైపుకు తరలి వస్తున్నారో! ఒక్క హజ్జ్‌ సీజన్‌లోనే కాదు, ఏడాది మొత్తం వారు వస్తూనే ఉంటారు. ఏడాదిలోని అన్ని నెలల్లోనూ, అన్ని  వారాల్లో  నూ, అన్నీ రోజుల్లోనూ, అన్నీ గంటల్లోనూ, అన్నీ ఘడియల్లోనూ కాబా గృహం భక్తుల ప్రదక్షిణలతో కళకళలాడుతూ నిండు వసం తాన్ని, భూతల స్వర్గాన్ని తలపిస్తూ ఉం టుంది. అలాగే ప్రవక్త ఇబ్రాహీమ్‌ (అ) చేసిన ప్రార్థనలో పండ్లు, ఫలాల ప్రస్తావన కూడా ఉంది. అంటే- ఒక మనిషి జీవికకు శాంతి భద్రతలు ఎంత అవసరమో పుష్కలమైన జీవ నోపాధి అంతే అవసరం. అల్లాహ్‌ా ఆయన (అ) మొరను ఆలకించాడు. మీరే గమనిం చండి!  నీరూ, పచ్చికా లేని ఆ కొండ ప్రాం తంలో నేడు విశ్వమంతటి నుంచి రకరకాల పండ్లు, కూరగాయలు పుష్కలంగా వచ్చి పడు తున్నాయి. హజ్జ్‌ సీజన్‌లోనూ, రమజాన్‌ మాసంలోనూ అక్కడికి వచ్చే భక్తుల సంఖ్య లక్షలు దాటి కోటికి చేరుతున్నా ఆహార సర ఫరాలలో ఎలాంటి కొరతా ఏర్పడదు. ఇటు వంటి మహిమాన్విత నగరం మక్కా పురం మినహా లోకం మొత్తంలో మరొకటి ఉందా?
4) అందులో స్పష్టమైన నిదర్శనా లున్నాయి. జమ్‌జమ్‌ జల బావి. మకామె ఇబ్రాహీమ్‌. సఫామర్వాల మధ్య సయీ, హజ్రె అస్వద్‌ మొదలైనవి.  మకామె ఇబ్రాహీమ్‌:
”మీరు ఇబ్రాహీము నిలబడిన (మకామె ఇబ్రా హీమ్‌) ప్రదేశాన్ని ప్రార్థనా స్థలంగా చేసు కోండి”. (అల్‌ బఖరా: 125)
  మకామె ఇబ్రాహీమ్‌ అన్నది ఒక రాయి. ఈబ్రాహీమ్‌ (అ) ఆ రాతి మీదే నిలబడి కాబా గృహాన్ని నిర్మించారు. ఆ రాయిపై ఆయన పాద చిహ్నాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆ రాయి ఒక అద్దాల కేసులో సురక్షితంగా ఉంచ బడింది. హజ్జ్‌-ఉమ్రాకు వేళ్ళే ప్రతి ఒక్కరూ కాబా ప్రదక్షిణ సందర్భంగా దాన్ని చూడ వచ్చు. కాబా ప్రదక్షిణ పూర్తయ్యాక ఆ స్థలం లోరెండు రకాతుల నమాజు చేయటం ప్రవక్త (స) వారి సంప్రదాయం – సున్నత్‌.
సఫా-మర్వా: ”నిశ్చయంగా సఫా మర్వాలు అల్లాహ్‌ చిహ్నాల లోనివి”.(బఖరా: 158) హజ్రత్‌ హాజిరా (అ) వారి నిరుపమాన త్యాగానికి గుర్తు సఫా మర్వాల మధ్య సయీ. )

Related Post