దురాలోచన-దూరాలోచన

Originally posted 2015-03-23 19:05:08.

అనేక మతస్థులు నివసిస్తున్న భారత దేశంలో ఒక మతానికి చెందినవారు మరో మతానికి చెందిన వారి పట్ల, వారు ఏ మతస్తులయినా ఆకర్షితులవ్వడం సాధారణంగా జరిగే విషయం. కారణం వారు స్త్రీ పరుషులు-మనుషులు అవ్వడమే. పెద్దగా కట్టుబాట్లు లేని కుటుంబాల్లో పెరిగిన పిల్లలే కాకా, గట్టి కట్టు బాట్లు ఉన్న కుటుంబాల్లో పెరిగిన యువతీ యుకుల్లో సయితం ఇటు వంటి ఆకర్షణ సర్వసాధారణంగా మనకు కనబడుతుంది. కొన్ని సంద ర్భాల్లో కోరిక దానికి కారణం అవ్వచ్చు, కొన్ని సందర్భాలలో క్యారెక్టర్‌ కారణం అవ్వచ్చు.

అనేక మతస్థులు నివసిస్తున్న భారత దేశంలో ఒక మతానికి చెందినవారు మరో మతానికి చెందిన వారి పట్ల, వారు ఏ మతస్తులయినా ఆకర్షితులవ్వడం సాధారణంగా జరిగే విషయం. కారణం వారు స్త్రీ పరుషులు-మనుషులు అవ్వడమే. పెద్దగా కట్టుబాట్లు లేని కుటుంబాల్లో పెరిగిన పిల్లలే కాకా, గట్టి కట్టు బాట్లు ఉన్న కుటుంబాల్లో పెరిగిన యువతీ యుకుల్లో సయితం ఇటు వంటి ఆకర్షణ సర్వసాధారణంగా మనకు కనబడుతుంది. కొన్ని సంద ర్భాల్లో కోరిక దానికి కారణం అవ్వచ్చు, కొన్ని సందర్భాలలో క్యారెక్టర్‌ కారణం అవ్వచ్చు.

ప్రజల మధ్య, వ్యక్తుల మధ్య ఎక్కడయితే నవీన టెక్నాలజీ ద్వారా దూరాలు తగ్గాయో, అక్కడే వారి మధ్య దూరాల్ని పెంచే విష వాయు వులు సయితం వ్యాప్తి చెందుతున్నాయి.ఈ క్రమంలో మన మధ్య పొడ సూపే అపోహల దుమ్మును, ఒకరి గురించి మరొకరికి ఉన్న అపార్థాల మబ్బులను దూరం చేసుకోవాల్సి ఆవశ్యకత ఎంతయినా ఉంది.ఎందు కంటే, ఒక వ్యక్తి తన ఇరుగు పొరుగున ఉన్న వారి గురించి అవగా హన కలిగి ఉండకపోతే అన్యులు అంటగట్టే రూమర్స్‌ను గుడ్డిగా అనుసరంచే ప్రమాదం ఉంది. ఫలితం ప్రక్క ప్రక్కనే నివసిస్తూ కూడా పగ ధ్వేషాలతో రగిలి పోతారు. ప్రేమ, అవగాహన ప్రజల్ని కలిపితే, ద్వేషం, అవగాహనారాహిత్యం ప్రజలను దూరం చేస్తుంది.ఈ నేపథ్యం లో-భారత దేశంలోని రెండు సముదా యాలు ఒకదాన్ని ఒకటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడే, చారిత్రక, సామాజిక, సాంస్కృతి కంగా స్నేహ సంబంధాలు అభివృద్ధి చెంది, దేశాభ్యుదయాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే కార్యక్రమాలు బలోపేతం కాగలవు. ముస్లింల గురించి ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలను దూరం చేసే ప్రయ త్నమే ఈ వ్యాసం. సహృదయులు, సుమతులు అర్థం చేసుకుని కాంతి కి కళ్ళు తెరుస్తారని భావిస్తూ….

ముస్లిం పర్సనల్‌ లా:

ముస్లిం పర్సనల్‌ లా అంటే నలుగురు భార్యల ను పెళ్ళి చేసుకునే సదుపాయం అని,ఎలా పడితే అలా మూడు సార్లు తలాక్‌ ఇచ్చుకునే సౌకర్యం అని సాధారణ ప్రజలకు ఇన్జక్ట్‌ చేయడం జరుగుతోంది. కాని వాస్తవానికి వ్యక్తిగత చట్టాల సదుపాయం అన్ని సమాజాలకు ఉంది. ఈ చట్టాలు న్యాయపరంగా వివిధ స్థాయిల్లో ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. ఉదాహరణకు హిందూ కుటుంబానికి ఆస్తి, శిస్తుల్లో మినహాయింపు ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో వివిధ తెగల కు వారి కుటుంబ వ్యవహారాల విషయంలో సంప్రదాయిక చట్టాలను పాటించే హామీ ఇవ్వబడింది. గోవాలో పోర్చుగీస్‌ చట్టం పాటించే అనుమతి, కేంద్ర పాలిత ప్రాంతాలయిన అండమాన్‌,చంఢీగడ్‌, నాగర్‌ హవేలి, డామన్‌ డివ్‌, లక్షదీప్‌, పాండిచ్చేరీలో అమలు పర్చే చట్టాలు. అలాగే ఉత్తరాది హిందువులు పాటించే కుటుంబ చట్టాలు, దక్షిణాది హిందువులు పాటంచే కుటుంబ చట్టాలు భిన్నమయినవి. ఈ చట్టాల్లో సంస్కరణ రావాలని చాలా మంది భావిస్తున్నారు. కానీ ఒక్కసారిగా యూనిఫాం సివిన్‌ కోడ్‌, ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి తీసుకు వస్తా మంటే ఎవరు ఎక్కువగా వ్యతిరేకిస్తారో ఆలోచనా పరులకు తెలియని విషయమేమీ కాదు.

ముస్లిం జనాభా పెరుగుదల ఆందోళనకరమా?

ముస్లింలు నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారని, అందుకే వారి జనాభా విపరీతంగా పెరిగిపోతుందని, త్వరలోనే వారి జనాభా హిందువుల జనాభాను అధిగమిస్తుందని, భారత దేశం ముస్లిం దేశంగా మారి పోతుందని లెక్కకు పొసగని విషయాలు కొందరు వేదికేక్కి మరి చెప్ప డం మనం గమనించవచ్చు. మతాల వారీగా జనాభా లెక్కల సర్వేలు గమనించినట్లయితే ఈ అపోహ ఎంత అసంబద్ధమయినదో తేలిపో తుంది. మళయాల మనోరమ ఇయర్‌ బుక్‌ 1992 ప్రకారం – 1971 జానాభా లెక్కల్లో హిందువులు 82.7/, ముస్లింలు 11.2/ ఉన్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం ఏటా ముస్లింల జనాభా పెరుగుదల రేటు 2.7 ఉండగా, హిందువుల జనాభా పెరుగుదల రేటు 2.3 ఉంది. అదే జమ్ము కాశ్మీర్‌లో ముస్లిం జనాభా పెరుగుదల రేటు 2.6 శాతం ఉండగా, హిందువుల జనాభా పెరుగుదల రేటు 3.7 శాతం ఉంది. ఈ లెక్కలను ప్రకారం మతాల వారీగా జనాభా పెరుగుదల స్థిరంగానే ఉందని చెప్పొచ్చు. అదే విధంగా ఇంకో వంద రెండు వం దల సంవత్సరాలు గడిచినా ముస్లింల జనాభా హిందువుల జానాభా కన్నా అధికమవ్వడం సాధ్యం కాని విషయం.

పాకిస్థాన్‌ ముస్లింల పవిత్ర భూమా?

పాకిస్థాన్‌ భారతీయ ముస్లింలకు పవిత్ర భూమి అన్న రూమర్‌ను దురాలోచనా పరులు కొందరు ప్రచారం చేస్తున్నారు. పాకిస్థాన్‌కుగాని, ఇతర ఏ దేశానికిగానీ ఇస్లాంలో ప్రత్యేక స్థానం లేదు. ఇస్లాంలో మక్కాకు, మక్కాలోని కాబా గృహానికి, మదీనాకు, మదీనాలోని మస్జద్‌ నబవీకి, బైతుల్‌ మఖ్దిస్‌కు, బైతుల్‌ మఖ్దిస్‌లో అఖ్సా మసీదుకు ఉన్నంత ప్రత్యేకత ప్రపంచంలోని మరే ఇతర భూభాగినికి లేదు. ప్రపంచంలోని 57 ముస్లిం దేశాలలో పాకిస్థాన్‌ ఒక దేశం అంతే. మలేషియా, ఇండోనేషియా మాదిరిగానే పాకిస్థాన్‌ కూడా ఓ ముస్లిం దేశం. ఆయా దేశాల జెండాకు ఒక భారత ముస్లిం ఎటువంటి ప్రాధా న్యత ఇవ్వడో పాకిస్థాన్‌ జెండా విషయంలో సయితం అంతే. అలాగే పాకిస్థాన్‌ క్రికెట్‌లోగానీ, హాకీలోగానీ, ఇంకే క్రీిడల్లోగానీ గెలిస్తే సంబ రాలు చేసుకోవాలని దేశంలో ఏ ధార్మిక గురువు, ధార్మిక కేంద్రం చెప్పదు. పైగా ఇటువంటి వాటికి కడు దూరంగా మసలుకోవాలని వారిస్తారు కూడా.

హజ్జ్‌ సబ్సిడీ:

హజ్జ్‌ యాత్రికులకు ఈ సబ్సిడీ ఇచ్చేవారు. అయితే నాటి నుండే ఈ సబ్సిడీని అనేక మంది ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే, స్థోమత గల వ్యక్తిపై మాత్రమే హజ్జ్‌ విధి అవుతుంది. దాని కోసం ఎవరి నుండి అతను సబ్సిడీ పొందాల్సిన అవసరం లేదు. ఇతర సముదాయాలకు సబ్సిడీలు ఉన్నా లేకపోయినా ముస్లింలకు ఈ సబ్సిడీ అవసరం లేదు. ఉండకూడదు.

పచ్చ జెండా, నక్షత్రం మరియు 786 ఇస్లాం చిహ్నాలా?

క్రౖౖెస్తవ మతానికి శిలువ చిహ్నం, హిందూ మతానికి ఓం లేదా స్వస్తిక్‌ చిహ్నం. ఇలా పచ్చ జెండా, నక్షత్రం మరియు 786 ఇస్లాం ధర్మానికి చిహ్నంగా భావిస్తుంటారు. సాధారణంగా ప్రజల్లో ఈ అభిప్రాయం ఎంత బలంగా ఉందంటే మత సముదాయాలకు ఏదయినా అప్పీలు చేయాలంటే ఈ గుర్తులను వాడుతుంటారు కూడా. ఏ మతం వియషం ఎలా ఉన్నా ఇస్లాం ధర్మాన్ని గుర్తించడానికి ఇటువంటి చిహ్నాలను వేటినీ ప్రతిపాదించడం కానీ, అధికారికంగా ఆమోదించడం కానీ ఇస్లాంలో లేదు.
కొన్ని ఆకతాయి చేష్టలు, మూఢనమ్మకాలు నేటి ఈ ఆధునికంలో ముస్లింలలో సయితం మనకు కనబడతాయి. అదేె కోవకు చెందినవి పై మూడు.ఈ పిచ్చి ఎంత ముదిరిందంటే, ఇంటి గుమ్మంపైన నెలవంక, నక్షత్రం,786 రాసుకునేటంత. పెళ్ళి పత్రికల్లో ముద్రించుకునేటంత. ఉత్తరాల్లో, ప్రతికల్లో ప్రచురించుకునేటంత. తమ కారు రిజిస్ట్రేషన్‌ నెంబరులో చివరి మూడు అంకెలు 786 ఉండాలని, తమ సెల్‌ఫోన్‌ నెంబరులో 786 అంకెలు ఉండాలని భారి మొత్తాన్ని చెల్లించడానికి కూడా వెనుకాడనంత. ఇది ఒక విధంగా సినిమాల ప్రభావం అని కూడా చెప్పొచ్చు.

ఇక నెలవంక, నక్షత్ర విషయానికొస్తే ఇస్లామీయ ఆరాధనలు చంద్ర మానంతో ముడి పడి ఉంటాయి. టర్కిలో ఏర్పడిన ఉస్మానీయా ప్రభు త్వం నెలవంక, నక్షత్రాన్ని తమ జెండాపై వాడుకునేవారు. దాన్నే ఇతర దేశ ప్రజలు కూడా గుడ్డిగా అనుసరించారు అంతే తప్ప వీటకి ఎలాంటి ప్రాధాన్యత లేదు. అయినా వీటి వాడకం ఎంతగా ప్రబలిం దంటే ఆమెరికాలో ముస్లింల ఉనికి, వారి పలుకుబడికి గుర్తుగా వాషిం గ్టన్‌ డి.సిలోని శ్వేత సౌధానికి ఎదురుగా ఉద్యాన వనంలో ఇటీవల ఈ చిహ్నాలను ఏర్పాటు చేశారు. ఏది ఎలా ఉన్నా ఇస్లాంలో మాత్రం ఇటు వంటి వాటికి ఎలాంటి ధార్మిక ప్రాధాన్యత లేదు. ఇలా కొందరు వాడే జెండాను దురాలోచనా పరులు కొందరు అది పాకిస్థాన్‌ జెండా అని అనుమానాలు సృష్టిస్తూ, ముస్లింల దేశాభిమానాన్ని దెబ్బ తీసే ప్రయ త్నం చేస్తుంటారు. ఆ క్రమంలో మరో అడుగు ముందుకేసి ప్రభుత్వ కార్యాలయాలపై వారే ఇటువంటి జెండాను ఎగరువేసిన సంఘటనలు వెలుగు చూసాయి. అయితే ఆ కుట్ర కొందరు దురాలోచనా పరుల దని తర్వాత విచారణలో తెలిసింది. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా భారత ప్రజలు మాత్రం వారికి ధీటుగానే, ఘాటుగానే సమాధానం ఇస్తున్నారు, ఇస్తుంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

లవ్‌ జిహాద్‌

హిందూ అమ్మాయిలను ప్రేమలో దింపి ముస్లిం యువకులు వారిని మతం మార్చుకునేలా చేస్తున్నారని, ఇదంతా ఒక ప్రణాళిక బద్ధంగా ముస్లిం సంస్థలు చేయిస్తున్నాయన్న నిందతో కూడినదిఈ దుష్ప్రచారం. కేరళ, కర్టాక శాసన సభల్తోపాటు ఇతరత్రా చోట్ల కూడా ఈ సమస్య ప్రస్తావనకు వచ్చింది. స్పందించిన కర్నాటక ప్రభుత్వం ఈ విషయ మయి విచారణకు ఆదేశించగా, ఇదంతా ఉత్త పుకారు అని తేలిపో యింది. ఇక్కడో విషయం గమనించాలి! అనేక మతస్థులు నివసిస్తున్న భారత దేశంలో ఒక మతానికి చెందినవారు మరో మతానికి చెందిన వారి పట్ల, వారు ఏ మతస్తులయినా ఆకర్షితులవ్వడం సాధారణంగా జరిగే విషయం. కారణం వారు స్త్రీ పరుషులు-మనుషులు అవ్వడమే. పెద్దగా కట్టుబాట్లు లేని కుటుంబాల్లో పెరిగిన పిల్లలే కాకా, గట్టి కట్టు బాట్లు ఉన్న కుటుంబాల్లో పెరిగిన యువతీ యుకుల్లో సయితం ఇటు వంటి ఆకర్షణ సర్వసాధారణంగా మనకు కనబడుతుంది. కొన్ని సంద ర్భాల్లో కోరిక దానికి కారణం అవ్వచ్చు, కొన్ని సందర్భాలలో క్యారెక్టర్‌ కారణం అవ్వచ్చు. ఏ మతానికి వ్యతిరేకంగా ఉన్నా భారత రాజ్యాంగాని కి వ్యతిరేకంగా అయితే వారు చేయడం లేదు. అలా అని వారి ఆ చర్య సమసర్థించడమూ మా ఉద్దేశ్యం కాదు. ఏది ధర్మం, ఏది అధర్మం అన్న అవగాహనే యువతీ యువకుల్లో లేకపోతే మిగిలేదీ స్త్రీ-పురుడు అన్న ఒక్క భావనే. ఇస్లాం ఈ విషయమయి ఎటువంటి ఆదేశాల్ని ఇస్తుందని అడిగితే మాత్రం-ఇస్లాం ఇటువంటి లజ్జారహిత పనుల్ని అనుమతిం చదు గాక అనుమతించదు, పైగా అలా ఎవరయినా రాసుకు, పూసుకు తిరిగితే దండన విధిస్తుంది. అది స్త్రీ, పరుషులకు-వారు ముస్లింలు అయినా సరే చేసే ఉపదేశం:
”(ఓ ప్రవాక్తా!)ముస్లిం పురుషులు (స్త్రీలు) తమ చూపులను క్రిందికి వాల్చి ఉంచాలని, వారు తమ మర్మాస్థానాలను కాపాడుకోవాలని, అది వారి కోసం చాలా పవిత్రమయినది అని వారికి చెప్పు”. (అన్నూర్‌: 30)

వివాహ విషయమయి ఖుర్‌ఆన్‌ ఆదేశం: ”బహు దైవారాధకులయిన స్త్రీలను,వారు విశ్వసించనంత వరకూ మీరు వారిని వివాహమాడకండి. బహుదైవారాధకురాలయిన స్వతంత్ర స్త్రీ మీకు ఎంతగా నచ్చినా ఆమె కంటే విశ్వాసురాలయిన బానిస స్త్రీ ఎంతో ఉత్తమం”. (అల్‌ బఖరహ్‌: 221)

ఇక ఎవరయితే ఇలా జరిగిపోతుంది, అలాజరిగిపోతుంది తెగ హంగామా చేస్తున్నారో వారే ఈ మధ్య అందుకున్న మరో నినాదం ‘బహూ లావో, బేటీ బచావో’-కోడల్ని తీసుకు రండి, కుమార్తెను కాపా డుకోండి అన్నది గమనార్హం! అసలు ఒకరి ఇంకొరికి మీద ప్రేమ పుట్ట డానికి ప్రణాళికలు అవసరమంటారా? నిజంగా ప్రేమ అనేది అసం కల్పితంగా, మానసికంగా మొదలవుతుంది. అది సహేతుకమా, కాదా అన్నది మాత్రం ధర్మం ఖరారు చేస్తుంది. అంతేగానీ బలవంతంగా ఎవరూ ఎవరినీ ఇష్ట పడేలా చేయలేము. ఆ విషయానికొస్తే ధర్మ విష యంలో సయితం బలవంతం లేదు అని చెబుతుంది ఖుర్‌ఆన్‌. ఇది మనిషి స్వేచ్ఛకు ఇస్లాం ఇచ్చే గౌరవం!

ఘర్‌ వాపసీ – తిరిగి గూటికి

భారత రాజ్యాంగం అధికరణలు 14,15,16,17 మరియు 18ల ప్రకా రం సమానత్వపు హక్కు ప్రసాదించబడింది. అలాగే మత స్వాతంత్రపు హక్కు అధికరణలు 25, 26, 27 మరియు 28ల ప్రకారం అందరికీ ఇవ్వబడింది. భారత రాజ్యాంగం ప్రకారం భారత దేశంలో అన్ని మతాలు సమానమే. ఏ మతమూ ఇతర మతంపై ప్రాధాన్యతను కలిగి లేదు. ప్రతి పౌరుడు తన మతాన్ని అవలంబిమచవచ్చు. పౌరులకు తన మతం గురించి బోధించవచ్చు. తన మతవ్యాప్తి కోసం పాటు పడ వచ్చు. ధార్మిక సంస్థలు, ప్రజాపయోగ స్వచ్ఛంద సంస్థలను స్థాపించు కోవచ్చు. కాని కొందరు రాజ్యాంగం ప్రసాదించే ఈ స్వేచ్ఛను భారత పౌరుల నుండి లాక్కోవాలని చూస్తున్నారు. ఘర్‌ వాపసీ అనేది ఎటు వంటి బలవంతం, బలాత్కారం లేకుండా జరిగితే భారత రాజ్యాంగం ప్రకారం ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు, ఉండకూడదు కూడా. కాని బలవంతాన రుద్దాలనుకోవడం, ఏవో ఆశలు కల్పించి ఘర్‌ వాపసీ ఎవరు చేసినా నేరమే. భారత రాజ్యాంగానికి విరుద్ధమే. ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశం అభ్యుధయ బాటన పయనించాలంటే మనం దురాలోచనను మానుకొని దూరాలోచనను అలవర్చుకోవాలి. అలా మనం చేసినప్పుడే మనం భారత పౌరులుగా భారత దేశాభ్యున్న తికి కారకులం కాగలం. దాని శాంతి భద్రతలను కాపాడిన వారం కాగలం!

Related Post